25, అక్టోబర్ 2017, బుధవారం

Their history ఎరుకల వారి చరిత్ర

Their history ఎరుకల వారి చరిత్ర
ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది. ప్రాచీన సాహిత్యం, శాసనాలు సమకూర్చే సమాచారా న్ని ఎరుకల ప్రజలు పాటిస్తున్న ఆచార సంప్రదాయాల్లోని ప్రాచీనతతో పోల్చి సమన్వయం చూస్తే వీరిది భారతదేశంలో ఒక అనాది తెగ అని స్పష్టంగా అర్థమవుతుంది. మహా భారతం ఇతిహాసంలో కనిపించే ఏకలవ్యున్ని ఎరుకలు తమ కులాధిపతిగా చెప్పుకుంటున్నారు. కానీ హరివంశం పురా ణం (34, 93-99 అధ్యాయాలు) ప్రకారం ఏకలవ్యుడు గిరిజనుడు కాదు, క్షత్రియుడు. మధ్య భారతదేశంలోని కేకయ రాష్ర్టాన్ని పాలించే రాజుకు-అతని రెండవ భార్య శృతదేవకు పుట్టినవాడు. శృతదేవ శ్రీకృష్ణుడికి మేనత్త. కాబట్టి ఏకలవ్యుడు కృష్ణుడికి బావమరిది. కృష్ణుడి మేనమామ కంసుడి మామ జరాసంధునికి సర్వసైన్యాధిపతిగా ఏకలవ్యుడు పనిచేశాడు. కృష్ణుడు కంసున్ని చంపినందుకు ప్రతీకారంగా జరాసంధుడు కృష్ణ-బలరాములచే రక్షించబడి, మధురా పట్టణంపైన 18 సార్లు దాడి చేశాడు. ఆ దాడుల్లో భాగంగా ఏకలవ్యుడు బలరామునితో భీకరమైన ధనుర్యుద్ధాలు, గదాయుద్ధాలు చేశాడు. కానీ కృష్ణుడు చివరికి ఏకలవ్యున్ని చంపాడు. పై చరిత్రలో ఏకలవ్యుడు క్షత్రియుడు ఏకలవ్యున్ని (తమ గిరిజన) మూల పురుషునిగా ఎందుకు భావిస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. ఒకటి, కేకయరాజు (ఏకలవ్యుడి తండ్రి) తాత బ్రహ్మణ స్త్రీని పెండ్లి చేసుకున్నందున క్షత్రియుల్లో తక్కువ జాతి అయిన సూత జాతికి (రథకారులు) చెందినవారుగా కేకయ వంశీయులు గుర్తించబడ్డా రు. రెండు, కేకయ రాజ్యంలో గిరిజనులే ఎక్కువమంది నివసించడం, అలాంటి గిరిజనులైన భిల్లులు, ఎరుకలు ఏకలవ్యున్ని తమ మూల పురుషుడిగా చెప్పుకోనారంభించారు. ఆయన జనరంజక పాలనకు గుర్తుగా ఇక ఇప్పటివరకు లభిస్తున్న ఆధారాలు ఏకలవ్యుడు భిల్లులకే ఎక్కువ దగ్గరివాడని సూచిస్తున్నాయి. అంటే బంగారు బాణం కలవాడు అని అర్థం. అతని పెద్ద కొడుకు పేరు బాణుడు. కీచకుడు అనే మరో పేరు గల ఇతడు ఏకలవ్యుని అన్న. భిల్లులు అనే పదం విల్లులు అనే పద భవం. అంటే బాణాలు ధరించేవారనేగా! కాబట్టి ఏకలవ్యుని తండ్రి, అన్నల వారసులుగా ధనుర్విద్యా విశారధుడైన ఏకలవ్యుని వారసులుగా కూడా చెప్పవ చ్చు. రెండవ కారణమమేమంటే, భిల్లులు ఇప్పటికే ఏకలవ్యుని దేశమైన కేకయ ప్రాంతం (మధ్యప్రదేశ్)లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఆ కాలం లో ఎరుకలు కూడా ఆ ప్రాంతంలో నివసించేవారేమో! అందుకే ఏకలవ్యున్ని తమ మూల పురుషునిగా చెప్పుకుంటున్నారేమో! ఇంకా ఆధారా లు వెతుకాలి. ఎరుకల స్త్రీలు తాము చెప్పే సోదే (భవిష్యత్ దర్శనం)కు శక్తినిచ్చేది గా రేణుకా ఎల్లమ్మను ప్రధానంగా తలుస్తారు. రేణుకా ఎల్లమ్మ కొడుకు పరశురాముడు పడమటి సముద్రాన్నుంచి భూమిని, రాజ్యాన్ని ఏర్పరిచి సుసంపన్నం చేశాడని ప్రాచీన భారత సాహిత్యం విశదం చేస్తుంది. అతని వారసులైన భృగువులు విజ్ఞానాన్ని.. ప్రత్యేకించి అధర్వణ వేదాన్ని సంకలనం చేశారని అల్లాడి పద్మనాభయ్య రాశారు. (ఏన్సియెంట్ భృగుస్ అనే గ్రంథంలో) అధర్వణ వేదంలో కనిపించే మూలికా వైద్య విధానాలు ఎరుకలలో కన్పిస్తాయి. కాబట్టి ఎరుకల వారిని ఎల్లమ్మ-పరశురాముల వారసులా అనే విషయాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. ఎరుకలవారు ఎక్కువగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో కనిపిస్తారు. కృష్ణానదిని వీరు ఏరు అంటారు. ప్రాచీనకాలంలో ఏరువనాడు అనే ఒక ప్రాంతం ఉండేది. దాని పరిపాలనా కేంద్రం ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఏటి ఒడ్డున ఆ పట్టణం ఉంది కాబట్టి దాని మొదటిపేరు ఏఱేశ్వరం అయి ఉంటుంది, క్రమంగా ఏలేశ్వరం అయి ఉంటుందని పలువురు స్థానిక సాహిత్య-చరిత్రకారులు భావించారు. కృష్ణా నది తీరప్రాంతంలోనే నల్లమల అడవుల్లో ఉన్న సరేశ్వరం శాసనాలు, సాహి త్య గ్రంథాల ప్రస్తావనలకు భిన్నంగా జన నానుడిలో సలేశ్వరంకావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపవచ్చు. క్రీ.శ.5వ శతాబ్దం ప్రాంతంలో ఏరువనాడులో కొంత అధికారం నెరపినవారు కనీసం మూడు దిక్కులకు వలసలు పోయి రాజ్యాలు స్థాపించినట్లు శాసనాలు, స్థల చరిత్రలు సూచిస్తున్నాయి. అలాంటివారిలో మొదటిశాఖ కర్ణాటకలోని బాదామి కేంద్రంగా క్రీ.శ. 540-750 మధ్య దక్కను రాష్ర్టాలను పాలించారు. రెండవ శాఖ కర్నూలు-కడప మండలం లో క్రీ.శ.6వ శతాబ్దంలో రేనాటి చోళులుగా స్థిరపడ్డారు. మూడవ శాఖకు చెందిన అనుమడు, కొండడు రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తుంది. అలంపూరు-సంగమేశ్వరం దగ్గరి తుంబెయనూరులో లభించిన 1400ల ఏండ్ల కిందటి రెండో పులకేశి (చాళుక్య రాజు) రాగి శాసనం చాళుక్యుల జన్మస్థానం (విషయం) ఇదేనని సూచిస్తున్నది. ఈ రాజుల అధికార చిహ్నం వరాహం (పంది) అది వారి శిల్పాలు, నాణేలపై కనిపిస్తుంది. పైసలను కూడా వరహం అనేవారు. వరాహ విషయం కూడా తెలుగు దేశంలోనే ఉండేది.వరాహాలను (పందులను) పెంచడం ఎరుకల ముఖ్య వృత్తి. తొలుత చాళుక్యుల సామంతులై తదనంతరం స్వతంత్రులైన కాకతీయులు కూడా వరాహ లాంఛనులే. ఎరుకల నాంచారి గుళ్లు వారి కాలంలో పేరొందా యి. ఈ చారిత్రక విషయాలను నిగ్గుతేలిస్తే ఎరుకల పూర్వ చరిత్ర విశదమవుతుంది. ఇప్పటివరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది.తెలుగు అంటే తెలియు అనే అర్థం కూడా మూల ద్రావిడ భాషా పదా ల్లో కనిపిస్తుంది. కాబట్టి తెలిపేవారు అనే అర్థం కలిగిన ఎరుకలవారి భాషలో కచ్చితంగా తెలుగు భాషా మూలాలు ఉంటాయి. నిజ నిర్ధారణ కోసం చేయవలసింది అధ్యయనం.

1 కామెంట్‌:

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...