25, అక్టోబర్ 2017, బుధవారం

Godavari గోదావరి

Godavari గోదావరి
గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నీటి విడుదలపై స్పష్టత యాసంగికి సాగునీరివ్వాలని సీఎం నిర్ణయం నీటిని పొదుపుగా వాడుకోవాలి.. వచ్చే ఏడాదికి కాళేశ్వరం నీళ్లు సిద్ధం ఆలోగా కాల్వల నిర్మాణం పూర్తికావాలి.. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి వివాదాలకు తావు ఇవ్వొద్దు.. ఎల్లంపల్లి నుంచి మరో ఎత్తిపోతల.. రామగుండంలో 20వేల ఎకరాలకు నీళ్లు ఎస్సారెస్పీ నీటి విడుదల భేటీలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి ఆయకట్టులో రెండోపంటకు నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరుడ్యాం, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కాల్వల ద్వారా రెండోపంటకు సాగునీరు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథకు కావాల్సిన నీటి అవసరాలుపోను మిగిలిన నీటిని పంటపొలాలకు మళ్లించాలని సీఎం సూచించారు. ఈ నీటితో రెండోపంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు తరలించుకోవాలన్నారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నిరకాల చెరువులను గోదావరి నీటితో నింపుకొనే విధంగా కాల్వలు సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వస్తున్నందున ఈలోపుగానే కాల్వల పనులు పూర్తికావాలని, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటిపారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకొనేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. ఎంత వీలైతే అంతవరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాలదాకా నీరు పారించి, పంటలు పండించడంపై శ్రద్ధ చూపించాలని చెప్పారు. ఇందుకోసం అధికారుల వెంటపడి అవసరమైన పనులు చేయించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందే విధంగా ఏర్పాటు జరుగాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల.. రామగుండం ప్రాంతంలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సారెస్పీ సామర్థ్యం పెంచాలని, అన్నిరకాల కాల్వల మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో తొలి, చివరి ఆయకట్టు అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బరాజ్ నిర్మిస్తున్నం. అక్కడ సగటున 1700టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని సీఎం అన్నారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బరాజ్‌లు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి, కృష్ణా నదీబేసిన్లలో చెరువుల ద్వారా 265 టీఎంసీల నీటి వాటా ఉన్నదని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు ధ్వంసం కావడం వల్ల అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల చెరువుల్లో నీటి లభ్యత ఉంటుందని, ఇందుకుగాను అన్ని చెరువులు నింపుకొనేలా కార్యాచరణ అమలుపరుచాలని సీఎం సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...