16, నవంబర్ 2017, గురువారం

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ...
SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)ఏ ద్వారా SC ST లకు ప్రమోషన్ లో రిజర్వేషన్ వచ్చాయి.కోర్టు తీర్పులఅనుసరించి సీనియారిటీ విషయం లో SC ST ఉద్యోగులకు కొంత చుక్కెదురు అయినా రిజర్వేషన్లు ప్రమోషన్ లలో పూర్తిగా సుప్రీం కోర్టు వ్యతిరేకించలేదు. సీనియారిటీ లిస్ట్ మరియు అక్కడి రోస్టర్ పరిస్థితి తదితర విషయాలు రాష్ట్రాలు చూసుకోవాలని కేంద్రం సూచించింది. ఆర్టికల్ 16(4)ఏ కూడా ప్రమోషన్ లలో రిజర్వేషన్లు పూర్తిగా రాష్ట్రాలకు అప్పజెప్పడం జరిగింది. గత కొంతకాలం గా సుప్రీం కోర్టు ఇస్తున్న తీర్పులను వక్రీకరిస్తూ దళితేతరా దేశం లోని ఉద్యోగ సంఘాలు కొంత హడావిడి చేస్తున్నాయి.కోర్టు తీర్పు లు ఒక తీరుగా ఉంటే అసలు ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కోర్ట్ కొట్టేసింది అని సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. అలా ప్రచారం మొదలుపెట్టడమే కాకుండా తెలుగు రాష్ట్రాల CS లను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సుప్రీం కోర్టు ,ఆ యా రాష్ట్రాల ఉద్యోగుల పదోన్నతి విషయం లో పారదర్శకత పాటించాలి,రోస్టర్ లో అక్కడ SC ST ల శాతం ఎంత ఉన్నదో చూడాలి అంటూ సూచనలు చేసింది. కానీ ప్రమోషన్ లలో రిజర్వేషన్ లను పూర్తిగా వ్యతిరేకించలేదు అని గమనించాలి. అసలు ఇవన్నీ కోర్టు తీర్పులు కాకుండా SCST లకు ఆర్టికల్ 16(4)ఏ ప్రకారం ,రాజ్యాంగ సవరణ కొరకు 117 సవరణ బిల్లు 2012 లో రాజ్యసభలో ఆమోదం అయి లోక్ సభలో ఆమోదానికి సిద్ధం గా ఉన్నది. SC,ST లకు ఈ బిల్ కనుక పాస్ అయితే ,ఈ కోర్టు తీర్పులు అంటూ సోషల్ మీడియా లో ఆధిపత్య కులాల గగ్గోలులు తగ్గినట్టే. మొన్నటిమొన్న కర్ణాటక రాష్ట్రం లో వేలాదిమంది ఆ రాష్ట్ర ప్రభుత్వ BC ,OC ఉద్యోగులు బారీ ర్యాలీ తీశారు.ఈ ర్యాలీ ఉద్దేశం ప్రమోషన్ లలో రిజర్వేషన్లు ఉండద్దు అన్నదే. రాజ్యాంగ సవరణ 117 వ బిల్ కనుక పాస్ అయితే వీళ్ళ నోళ్లు దానికవే మూతపడుతాయి అన్నది నిజం. బీహార్ ఎన్నికల్లో SC,ST ప్రమోషన్లలో రిజర్వేషన్ల బిల్లు లో కొంత కదలిక తెచ్చిన బీజేపీ సర్కారు కుట్ర పన్నింది.ఎలాగూ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా ఉన్న బిసి మెజారిటీ సమాజం ప్రమోషన్లలో రిజర్వేషన్లకు ససేమిరా అంటుంది.ఈ విషయం తెలిసిన బీజేపీ ,బీహార్ ఎన్నికల్లో బీసీ మరియు SCST ల ఐక్యత ను దెబ్బతీసే కుట్రలు చేసింది.ఇలాంటి కుట్రలో భాగంగానే ,మండల కమిషన్ గొడవల సమయం లో" SC,ST అట్రాసిటీ చట్టం" ను చేయడం అని గమనించాలి. ఇవన్నీ తెలియని దళిత ఉద్యోగులు ,ఉద్యోగ౦ వచ్చిన తరువాత పోరాటాలు మరచి వట్టి వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళు బాబాసాహెబ్ వలన దళిత సమాజానికి రెప్రెజెంటేటర్లo అనే సంగతి మరచి పోతున్నారు. ముందుగా ప్రమోషన్ లలో రిజర్వేషన్ల ను మనం ఉద్యోగులుగా సాదించుకుంటే భావి తరాలకు బాసట గా నిలుస్తాయి.తద్వారా మంచి స్థానం లో దళితులు ఉంటే సమాజానికి కూడా మేలు చేసినవారు అవుతారు గమనించండి. మాకు ఇది చాలు అనుకోవడానికి మీకు బాబా సాహెబ్ రిజర్వేషన్లు కల్పించలేదు. దళిత సమాజానికి మీరు మీ వంతుగా మేలు చేస్తారు అని రిజర్వేషన్లు కల్పించారు అని మరవద్దు . కర్ణాటక లో ఆధిపత్య కుల ఉద్యోగులకు ఉన్నO త తెలివి మీకు లేకపోవడాన్ని నేను విమర్శిస్తూ.... 117వ రాజ్యాంగ సవరణ బిల్ లోకసభలో ప్రవేశపెట్టాలి,ఆమోదం అయ్యేలా చూడాలని బీజేపీ సర్కారుని డిమాండ్ చేస్తూ..

TRS టి.ఆర్.ఎస్

టి.ఆర్.ఎస్ ప్రభుత్వము చేస్తున్న అప్పు తెలంగాణ ప్రజలకు ముప్పు మంగళ వారం తేది 14-11-2017 న అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయములో ఆర్థిక శాఖమాత్యులు ఇచ్చిన వివరణ ప్రకారముగా తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు ₹ 69,479-48 కోట్లు . రాష్ట్ర ము ఏర్పడ్డాక అదనముగా ₹ 66,074-55 కోట్లు. అప్పు చేయడము జరిగింది. ఇప్పుడు మొత్తం అప్పు ₹ 1,35,554-03 కోట్ల అప్పు అయింది. ఈ అప్పుకు 2016-2017 ఆర్థిక సంవత్సరముకుగాను ₹ 8,609-19 కోట్ల వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ అప్పు తెలంగాణ ప్రజలకు తలసరిగా 40 వేలు పడుతుంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ₹ 1,66,000 కోట్ల అప్పు. అందులో ₹ 18వేల కోట్ల అప్పు మీద వివాదము ఉన్నది. మిగిలిన ₹ 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసిన అప్పును " సమాచార హక్కు చట్టం 2005 ప్రకారముగా ఔత్సహికుడు తీసుకున్న సమాచారమును 2016 నవంబరు లో ఇంగ్లీష్ పత్రికలో వెలువరించిన వివరాల ప్రకారముగా 2014 నవంబరు నుండి 2016 జూన్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ₹ 33,033 కోట్ల అప్పు చేసింది. (01) విదేశాల నుండి తీసుకున్న అప్పులకు షరతులు తెలియవు. (02) ₹1423 కోట్ల అప్పుకు 5 శాతము నుండి 6.7 శాతము వడ్డీ , నాబార్డ్ నుండి తీసుకున్న ₹ 1600 కోట్ల అప్పుకు 7.5 శాతము వడ్డీ, బహిరంగ మార్కెట్ నుండి తీసుకున్న అప్పు ₹ 28,048 కోట్ల అప్పుకు 7.39 శాతము వడ్డీ, చిన్న మొత్తాల పొదుపు సంస్థ నుండి తీసుకున్న అప్పు ₹ 1845 కోట్ల అప్పుకు 9.5 శాతము వడ్డీ, హడ్కో నుండి తీసుకున్న ₹ 1125 కోట్ల అప్పుకు 10.45 శాతము వడ్డీ, NCDC నుండి తీసుకున్న ₹ 114 అప్పుకు 11.85 శాతము నుండి 12.10 శాతము వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల ఊబిలో కూరుకపోయే ప్రమాదమున్నదని " కాగ్ "/భారత కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ " తన నివేదికలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న అప్పులో సగానికి పైగా వచ్చే ఏడేండ్లలో తిరిగి చెల్లించవలసి ఉంటుందని తెలుస్తుంది. ఆ అప్పును చెల్లించడానికి మరల అప్పు చేయవలసిన పరిస్థితి పొంచి ఉన్నది. అలాగే చేసిన అప్పులకు వడ్డీలను చెల్లించడానికి కూడా అప్పులు చేయవలసిన పరిస్థితి పొంచి ఉన్నదని అభిశంచింది. మన భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కొనసాగించి " తెలంగాణను సాధించుకోవడము జరిగింది. ఇప్పుడు టి.ఆర్.ఎస్ ప్రభుత్వము చేస్తున్న అప్పును నిలువరించడానికి సమయాత్తము కావలసిన అవసరమున్నది.

15, నవంబర్ 2017, బుధవారం

Shanthi Swaroop శాంతి స్వరూప్

శాంతి స్వరూప్ వికీపీడియా లో నేను రాశాను Shanthi Swaroop శాంతి స్వరూప్
మాతృభాషలో పేరు శాంతి స్వరూప్ నివాసం హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం జాతీయత భారతీయుడు చదువు పట్టభద్రుడు వృత్తి యాంకర్ , దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి . మతం హిందూ జీవిత భాగస్వామి సహ యాంకర్ రోజా రాణి పిల్లలు ఇద్దరు కుమారులు పురస్కారాలు తెలంగాణ రాష్ట్రం శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్ మరియు అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి . బాల్యం, కుటుంబం హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన. శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే కాలం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. జీవిత విశెషాలు నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ప్రారంభించారు… తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం. వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. వృత్తి ఆయన వృత్తి రీత్యా 1977 అక్టోబర్ 23 లోనే లాంఛనప్రాయంగా హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది.మూడు దశాబ్దాల క్రితం కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు చెప్పారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన పదేళ్ల పాటు అదే పరిస్థితి. టెలీ ప్రాంప్టర్ లేదు.. తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఆనాటి జ్ఞాపకాలని ఆయన అంటారు . మంచి వక్త తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు [3]. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు.​ "వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి....,"అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు.

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...