20, ఆగస్టు 2017, ఆదివారం

Razakarlu రజాకార్లు

Razakarlu రజాకార్లు
Razakarlu రజాకార్లు... వికీపీడియా నుండి రజాకార్లు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు.. హైదరాబాద్ రాజ్యంలో సయ్యద్ ఖాసిమ్ రజ్వి నాయకత్వంలోని రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. వారు చేయని దుష్టకృత్యం లేదు. రజాకార్లంటే శాంతిని వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కాని వీరు శాంతిని నాశనం చేసి మానవ రక్తాన్ని తాగిన రాకాసి మూకలుగా ఉండేవారు. హిందూ జనాభాపై క్రిమినల్ దాడుల తో మత హింసను ప్రేరేపించారు రజాకర్ల దౌర్జన్యాలు ముఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి స్త్రీలను ఎత్తుకెళ్ళారు. పురుషులను వెయ్యిల మందిని చంపారు రకరకాలుగా ఎంతో మందిని చిత్రహింసలు పెట్టిన పాశాన హృదయులు ... అలా మొదలైంది[మూలపాఠ్యాన్ని సవరించు] 1910 భారతదేశానికి, బ్రిటిషుకీ మద్య జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా మనకు స్వతంత్రం బ్రిటిషు వారు ఎప్పుడైన ఇవ్వవచ్చు అనే మాట ఊహాగాణాలు వినిపిస్తూన్న రోజుల్లో 1919 బ్రిటీష్ పాలన ప్రజా సంక్షేమం మరిచి ప్రజల్ని పిండి పిప్పిచేసి ఇక భారతదేశానికి స్వాతంత్య్రం మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది మరి వినిపిస్తూన్న రోజుల్లో 1920 వరకు హైదరాబాద్లో ఎలాంటి రాజకీయ సంస్థ లేదు.ఆంధ్ర జన సంఘం (ఆంధ్ర మహాసభ పేరు మార్చబడింది) అని పిలవబడే ఒక సంస్థ నవంబర్ 1921 లో స్థాపించబడింది, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో రాచరిక ప్రభుత్వలు "భారతదేశం యొక్క అంతర్భాగమైనవి" అని ప్రకటించాయి మరియు భారత జాతీయ కాంగ్రెస్ పరిపూర్ణంగా ఆ తీర్మానాన్ని ఆమోదించింది,హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ఆలోచనలతో హైదరాబాద్ రాష్ట్ర జనాభాలో 80% కంటే ఎక్కువ మంది హిందూలు అయినప్పటికీ, నిజాం యొక్క అధికారం, ముస్లింలు ఆధిపత్యం వహించాయి. నిజాము రాష్ట్రంలో ఇస్లామిక్ పాలనను కాపాడుకునే వర్గలకు నిజాం యొక్క మరియు ముస్లిం ఆధిపత్య మతతత్వ సంస్థలు అధికారం కాపాడుకునే ఆలోచనలతో ప్రత్యన్ మయాల కోసం ప్రక్రియ ప్రారంభమైంది. సంస్ధను[మూలపాఠ్యాన్ని సవరించు] హైదరాబాద్ స్టేట్ యొక్క రాచరికపు విశ్రాంతిత ఉద్యోగి అయిన నవాబ్ మహ్మూద్ నవాజ్ ఖాన్ ఖైల్లార్చే మజ్లిస్-ఇ-ఇతిహాదుల్ ముస్లైమేన్ తో MIM సంస్ధను నవంబర్ 12, 1927 స్థాపించబడింది. భారతదేశంతో ఏకీకరణ కంటే "ముస్లింల రాజ్యంగా" . 1938 లో, బహదూర్ యార్ జంగ్ MIM యొక్క "ప్రెసిడెంట్" గా ఎన్నికయ్యారు,ఇతడే రజాకార్ అనే పదం ఉపయోగిచారు, రజాకార్లంటే శాంతిని వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం ఇది "సాంస్కృతిక" మరియు మతపరమైన మానిఫెస్టో కలిగి ఉంది. ఇది ముస్లిం లీగ్తో పాటు, బ్రిటీష్-ఆక్రమిత భారత దళాధిపతుల సహచరులుగా ఉండేది. 1944 లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తరువాత, సయ్యద్ ఖాసిమ్ రజ్వి నాయకుడిగా ఎన్నికయ్యారు. రజాకార్ నాయకుడు[మూలపాఠ్యాన్ని సవరించు] సయ్యద్ ఖాసిమ్ రజ్వి సయ్యద్ ఖాసిమ్ రజ్వి|కాసిం రిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, హింసాత్మక, హిందూ వ్యతిరేక ఇస్లామిస్ట్ పారామిలిటరీ సంస్థ, స్వీయ-శైలి "స్వయంసేవకుల" సంస్థ, రజాకార్లు MIM కోసం "తుఫాను దళాల" గా పనిచేశారు. కాసిం రిజ్వీ జన్మస్థం లాతుర్ లో జన్మించాడు మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో లా చట్టాన్ని అభ్యసించారు. హైదరాబాద్ నగరంలో మొహమ్మద్ అలీ ఫజైల్తో కలిసి అతను పట్టభద్రుడైన తర్వాత హైదరాబాద్కు వలస వచ్చారు. తరువాత అతను ఓస్మానాబాద్ జిల్లాలోని లాతూర్లో ఒక న్యాయవాదిగా స్థిరపడ్డాడు, ఇక్కడ అతని మాజీ అప్పటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అతని అత్తగారు అబ్దుల్ హై ద్వారా పరిచయాలు ఉన్నాయి. మాజీ హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగి మొహమ్మద్ హైదర్ కధనం ప్రకారం మజ్లిస్-ఇ-ఇతిహాడుల్ ముస్లైమీన్ (ఇత్తెహాద్) లో చేరిన తరువాత, రజ్వి తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు, ఇది అతనిని ప్రముఖంగా చేసింది మరియు అతనిని సిద్దిక్-ఎ-డెక్కన్ పేరుతో సంపాదించింది.1944 లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ యొక్క అకాల మరణం తరువాత, ఇతిహాడ్ పార్టీ వినాశకరమైన తీవ్రవాదానికి గురైంది. ఇతిహాద్ సభ్యత్వానికి వారు సానుకూలంగా లేనప్పటికీ, రాజకీయ సంస్కరణలను సమర్ధించడం ద్వారా రజ్వి తన వైవిధ్యతను స్థాపించడానికి ప్రయత్నించారు. అప్పుడు లాతూర్లో తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు, మజ్లిస్-ఎ-ఇస్లా నజ్మ్-ఓ-నస్క్ అనే పేరు పెట్టారు, సంస్కరణలను తీసుకురావటానికి, పార్టీ యొక్క ప్రధాన స్రవంతి నుండి తన సొంత స్వతంత్రాన్ని స్థాపించటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫిబ్రవరి 1946 లో, అబ్దుర్ రెహమాన్ రాయ్స్ నాయకత్వంలోని పార్టీలో తీవ్రవాదులు ఒక మసీదు పునర్నిర్మాణం మీద హింసాత్మక నిరసన ప్రదర్శించారు, ఛత్రా యొక్క ప్రధాన మంత్రి నవాబ్ మరియు సర్ విల్ఫ్రిడ్ గ్రిగ్సన్, రెవిన్యూ మరియు పోలీసుల మంత్రి. సంఘటన ఇథిహాడ్ నాయకుడు రాజీనామా కు దారితీసింది. నూతన అధ్యక్షుడి కోసం జరిగిన పోటీలో కాసిమ్ రజ్వి రైట్ను ఇతిహాడ్ నాయకుడిగా వెలుగులోకి తెచ్చాడు. అతని తీవ్రవాదం రైస్ మరియు పార్టీలో ఉన్న మితవాదులు రెండూ అభ్యర్థుల నుండి దూరమయ్యాయి. నిజాం పాలన కొనసాగింపు మరియు పాకిస్థాన్కు వెళ్లడానికి నిజాంని ఒప్పిస్తున్నట్లు ముస్లిం వేర్పాటువాదులు ఉన్నారు.రజ్వి కఠినంగా ఉన్న దృక్పధాన్ని తీసుకోవటానికి నిజామ్ను ప్రోత్సహించాడు మరియు కొత్తగా ఏర్పడిన భారతదేశ ప్రభుత్వానికి హైదరాబాద్ లో ప్రవేశపెట్టడానికి రజకర్లను ఆదేశించాడు.రజ్వి యొక్క రాజాకర్లను ఖండిస్తూ మరియు భారతదేశంతో విలీనం చేయమని వాదించిన షూబూల్లా ఖాన్ వంటి దేశభక్తి ముస్లింల హత్యలో అతను కూడా చిక్కుకున్నాడు. రజ్వి హిందూ జనాభాపై క్రిమినల్ దాడులను ప్రారంభించాడు, భారతదేశానికి పోలీస్ యాక్షన్కు దారితీసింది.ఆపరేషన్ పోలో తర్వాత, భారత సైన్యం రజకర్లను ఓడించి, భారత దేశంలో హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్న తరువాత, రజ్వీని గృహ నిర్బంధంలో ఉంచారు మరియు భారతీయ చట్టాలపై తిరుగుబాటు కార్యకలాపాలకు ప్రయత్నించారు మరియు మత హింసను ప్రేరేపించారు. అతనికి 1948 నుండి 1957 వరకు జైలు శిక్ష విధించబడింది. అతను జైలు నుంచి విడుదలైన తరువాత పాకిస్తాన్ కు వేళ్లి అక్కడ, అతను 1970 లో అనాధాలా మరణించాడు. హైదరాబాద్ నుండి 1949 లో అతని కుటుంబం పాకిస్తాన్ కు వేళ్లి అక్కడ నివసిస్తున్నది. రజాకర్ల కౄరత్వం, దౌర్జన్యాలు[మూలపాఠ్యాన్ని సవరించు] నిజాం కుటుంబ పరిపాలనకు తనే చివరి రాజునని 1921 లో అనే అనుమానం వచ్చినా తెలంగాణ పరిపాలనలో అబివృద్ది తన మార్కు ఉండాలని ముందు బావించాడు,ఎన్నో మంచి నిర్మాణాలు చేశాడు. [2][3] ఆ తరువాత పరిస్ధితి చెయ్యిదాటి పోతుంటే హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ జాగ్రత పడ్డాడు, చివరి రెండు సంవత్సరాలు 1946 - 1948 అనిచివేత మార్గంగా కాసిం రిజ్వీ తప్పుడు సలహాలతో భారత సైన్యం రజకర్లను ఓడించి, భారత దేశంలో హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్న తరువాత, నిజంగానే చివరి రాజుగానే మిగిలిపోయాడు. అతను అలా కాక అతని కంటే ముందు నిజాం రాజుల్లా పాలించి ఉంటే నేపాల్ , బూటాన్ లాగ స్వతంత్ర దేశం లా ఉండేదేమో ...1881లో మొదటి సాలార్‌జంగ్ ప్రభువు(నిజాం) హాయాంలో పావిన్స్) ప్రాంతాల విభజన చేపట్టాడు. అప్పుడే జిల్లాల ఏర్పాటు కావించబడినవి. నిజాం పరిపాలనలో తెలంగాణ మరట్వాడ, కర్ణాటక మూడు ప్రాంతాలుగా ఉండేవి. కర్నూలు ప్రాంతంగా కిషన్‌సింగ్, కమతం వెంకట్‌డ్డి, గడియారం రామకృష్ణశర్మ, గొట్టిముక్కుల కృష్ణమూర్తి తదితరులు రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేశారు. కొందుర్గు ప్రధాన వీధుల్లో ప్రతి నిత్యం రజాకార్ల కవాతును. పరిగి కేంద్రంలో ప్రతి నిత్యం తల్వార్లు, కత్తి తుపాకులు బరిసెలు, లాఠీలు చేత పట్టుకున్న రజాకర్లు కవాతు నిర్వహించి ప్రజలు తమకు ఎదురు తిరగడానికి కూడా సాహసించని పరిస్థితిని కల్పించేవారు. హైదరాబాద్ సైన్యం 1946 - 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది. 1938లో హైద్రాబాద్‌లో ఆర్యసమాజ్ వారు హిందూవుల ఏకీకరణకై ఉద్యమాలు ప్రారంభించారు. అదే సమయంలో స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రామానంద తీర్థ ఆధ్వర్యంలో కూడా జనజాగృతి ఉద్యమాలు సాగాయి. తెలంగాణలో రజాకార్లు బహదూర్ యార్‌జంగ్ (జాగీర్ధార్) అప్పటికీ మజ్లిస్ ఇత్తిహదుల్‌ముస్లిమిన్ పార్టీని స్థాపించి తద్వారా నిజాంకు ప్రభుత్వానికి సమాంతరంగా తెలంగాణలో తమ ఆధిపత్యం కోస గ్రామాలపై పడి ప్రజలను భయవూభాంతుల్ని చేసేవారు.రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. మరోవైపు కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధ పోరాటం సాగుతోంది[4]. బైరాన్‌పల్లి వీరుల చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు] బైరాన్‌పల్లి గ్రామంలో 1946లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సాయుధ దళాలు ఆ సంఘ సభ్యులకు సాయుధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఈ తరుణంలో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలు జనగామ పరిసర గ్రామాల్లో విచ్ఛలవిడిగా పెరిగిపోయాయి. బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్య తదితర యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో గ్రామరక్షక దళం సంఘం ఏర్పడి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. రాజాకార్లు పోలీస్ క్యాంప్‌ల కోసం ప్రతి గ్రామానికి జరిమానా విధించి వసూలు చేసేవారు. బైరాన్‌పల్లి రైతులను సైతం రకరకాల పన్నులు చెల్లించాలని రజాకార్లు ఆజ్ఞలు జారీచేశారు. వారి ఆదేశాలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచింది. రజాకార్లు పొరుగు గ్రామమైన లింగాపూర్ (మద్దూర్)పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు ఇమ్మడి రాజిరెడ్డి, మోటం రామయ్య, వంగాల అనంతరామిరెడ్డితోపాటు దూల్మిట్టకు చెందిన ముకుందారెడ్డి, మురళీధర్‌రావు దళాలు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. బండ్లలో దోచుకొని వెళుతున్న ధాన్యాన్ని రజాకార్లు వదిలేయడంతో ధాన్యాన్ని గ్రామస్తులకు అప్పజెప్పారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని ఏ విధంగానైనా విధ్వంసం చేయాలని నిజాం రాజుకు కబురుపెట్టారు. 1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించగా వీరి రాకను అబేధ్యమైన బురుజుపై నుంచి పసిగట్టిన దాసరి నాగయ్య, శ్రీరామోజు బ్రహ్మయ్యలు నగారా మోగించారు. దీంతో బురుజుపై నుంచి రజాకార్లపై దాడి కోసం సిద్ధంగా ఉంచుకున్న జెజ్జాయి (సీసం, ఇనుము, గంధకం పోసి నింపిన ఒక పెద్ద గొట్టం)ని పేల్చారు. గ్రామానికి చెందిన దళనాయకుడు ఇమ్మడి రాజిరెడ్డి ఓ పోలీస్ అధికారి కొడుకును గురిచూసి కాల్చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు రజాకార్లు హతమవడంతో తక్కినవారు ప్రాణభయంతో పారిపోయారు. రెండోసారి రజాకార్లు 150 మందితో గ్రామంపై దాడికి దిగారు. ప్రజలు వారిని ఎదురించి వడిసెల్లో రాళ్లు పోసి కొట్టి 20 మంది రాజాకార్లను చంపారు. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్తులు చనిపోయారు. రెండుసార్లు విఫలమైన రజాకార్లు గ్రామంపై ప్రతీకారాన్ని పెంచుకున్నారు. గ్రామ ప్రజల్లో మాత్రం రజాకార్లను ఎదురించగలమనే ధైర్యం, విశ్వాసం పెరిగింది. గ్రామస్తులు మాత్రం రాత్రింబవళ్లు నిద్రపోకుండా పహారా కాస్తు రజాకారుల, ముష్కర మూకల నుంచి కాపాడుకుంటూ వచ్చారు. బైరాన్‌పల్లికి ఆగస్టు 27 చీకటిదినం రెండుసార్లు రజాకార్లను తరిమికొట్టిన ధీమాతో ఏ క్షణమైనా తమపై ఎదురుదాడికి రజాకార్లు పాల్పడవచ్చని, దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామ యువకులు నిశ్చయించుకున్నారు. రాత్రి ఎప్పటిలాగానే గెరిల్లా దళం గ్రామస్తులకు ధైర్యం చెప్పి వెళ్లింది. జనం నిద్రలోకి జారుకున్నారు. 1948 ఆగస్టు 27న ఉదయం 3 గంటలకు 1200 మంది పోలీసులు, రజాకార్లు నలుదిక్కుల నుంచి గ్రామాన్ని చుట్టుముట్టారు. కాలకృత్యాల కోసం ఊరిబయటికి వచ్చి రజాకార్లకు పట్టుబడి తప్పించుకున్న ఉల్లెంగల వెంకటనర్సయ్య రజాకార్లు వచ్చారంటూ వేసిన కేకలకు బురుజుపై యుద్ధనగారా మోగడంతో గ్రామరక్షణ దళంతోపాటు జనమంతా అప్రమత్తమయ్యారు. కాల్పులు జరుపుతూ మిల్ట్రీ గ్రామానికి చేరుకుంది. బురుజుపై ఉన్న గ్రామరక్షక దళం సభ్యులు జెజ్జాయితో కాల్పులు జరుపుతూనే ఉన్నారు. రజాకార్లు ఫిరంగితో రెండు తోపుబాంబులు వేయగా అవికాస్త గురితప్పాయి. మూడో గుండు బురుజుపై పడటంతో మోటం రామయ్య, మోటం పోశయ్య, బలిజె భూమయ్యతోపాటు మరికొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రధాన రక్షణ కేంద్రం ఎదురుదాడిలో దెబ్బతినడంతో సైనికులు గ్రామంలోకి చొరబడ్డారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బురుజుపైన, ఇళ్లల్లో దొరికిన వారిని దొరికినట్లుగా లెంకలు కట్టి ఆడమగ తేడా లేకుండా వరుసగా నిలబెట్టి కాల్పులు జరపడంతో గ్రామంలోని వాడలన్నీ శవాలతో నిండిపోయి శ్మశానాన్ని తలపించాయి. ఊరిలోని గడ్డివాములు, ఇళ్లు తగలబడటమే కాకుండా మహిళలపై రజాకార్లు అత్యాచారాలకు పాల్పడ్డారు. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి రజాకార్లు తమ పైశాచిక ఆనందాన్ని నిరూపించుకున్నారు. ఈ హింసకాండతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ పాశవిక సంఘటన జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని మరిపించేలా ఉందని చరిత్రకారులు తెలిపారు. రజాకార్ల దుర్నీతి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన బైరాన్‌పల్లికి చెందిన 100 మందిని రజాకార్లు నిర్ధాక్షిణ్యంగా పొట్టనపెట్టుకున్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమీప గ్రామమైన కూటిగల్ గ్రామప్రజలు సైతం రజాకార్లపై తిరుగుబాటు చేశారు. అదేరోజు నిజాం ప్రభుత్వం 200 మంది మిల్ట్రీతో కూటిగల్ పై దాడికి దిగి 20 మందిని గ్రామశివారులోని మర్రిచెట్టు కింద ఊచకోత కోశారు. ఎదిరించి[మూలపాఠ్యాన్ని సవరించు] రజాకార్ల ఆగడాలను ఎదిరించి దొడ్డి కొమరయ్య , బందగి , బత్తిని మొగిలయ్య గౌడ్ , కొమురం భీమ్ , రాంజీ గోండు , షోయబుల్లాఖాన్,తోపాటు వెయ్యిల మందిని చంపారు. మరికొందరిని ఆరుట్ల రామచంద్రారెడ్డి , మల్లు స్వరాజ్యం , చాకలి ఐలమ్మ ,రావి నారాయణరెడ్డి , నారాయణరావు పవార్ , చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి , గంగారాం , జగదీశ్ తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు తోపాటు ఎంతో మందిని హింసలు పెట్టినారు[5]. ఇనుగుర్తిలో రజాకార్ల దాడులు 1922 ఆగస్టు 22న అప్పటి నిజాం ప్రభుత్వం హయంలో ఓరుగల్లుకు గ్రామంగా ఉన్న కేసముద్రం మండలం ఇనుగుర్తిలోనే ముద్రించారు. తెనుగు పత్రికలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వస్తున్న వార్తలకు మండిపడ్డ రజాకార్లు ఇనుగుర్తి గ్రామానికి చేరుకుని దాడులకు దిగారు. ఒద్దిరాజు సోదరులకు చెందిన గ్రంథాలను, ముద్రణ మిషన్‌లను ధ్వంసం చేసి తగుల బెట్టారు. ఈ క్రమంలో స్నేహితుల సహకారంతో పత్రిక నిర్వహణను జిల్లా కేంద్రానికి మార్చారు. తర్వాత కొద్ది నెలలకు పలు కారణాల వల్ల పత్రిక ప్రచురణ నలిచిపోయిం ది. మొత్తం మీద తెనుగు పత్రిక ఆరు సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రచురితమైంది[6]. గోలకొండ పత్రిక తెనుగు పత్రిక తర్వాత పుట్టిన గోలకొండ పత్రిక కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ దక్కన్ కేంద్రంగా ప్రతీ సోమ, గురువారాల్లో వెలువడిన ఈ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు. 1926లో గోలకొండ పత్రికను ప్రారంభించారు[7]. ఇమ్రోజ్ ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను షోయబ్ ఉల్లాఖాన్ వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948, ఆగష్టు 22 న రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు. మరి కొన్ని గ్రామాలు[మూలపాఠ్యాన్ని సవరించు] ఇలా ఎన్నో సంఘటనలు జరిగినవి తెలంగాణ మొత్తనా రజాకార్ల ఆగడాలు తాకిడి లేని గ్రామం లేదు. ఇబ్బంది పడని కుటుంబం లేదు[8]. చరిత్ర పుటలకు యేక్కని ... ఇలా ఎన్నో గ్రామల్లో దాడులకు గురిఅయ్యాయి. బైరాన్‌పల్లి , కూటిగల్ ,ఆకునూర్ , అప్పంపల్లి , మాచిరెడ్డిపల్లి , రేణిగుంట , గాలిపల్లి పరకాల , పెరుమాండ్ల సంకీర్త , దర్మారం , ఉయ్యాలవాడ , భువనగిరి , సూర్యాపేట , చిట్యాల మండలం గుండ్రాంపల్లి మునగాల ,మండలం నరసింహములగూడ , పూగేల , పాతర్లపాడు , బీబీనగర్ , పాల్వంచ మండలం లోని గిరిజన బండ్లగూడ మెదక్ రాయికోడ్ , అర్వపల్లి , మహబూబ్ నగర్ , అమ్మాపూర్ నాంచారిమడూర్ , రంగాపురం , కనిపర్తి ఇలా ఎన్నో గ్రామల్లో దాడులకు గురిఅయ్యాయి[9]. రాజకీయ పరిణామాలు[మూలపాఠ్యాన్ని సవరించు] విలీన సందర్భం ఆపరేషన్ పోలో-1948 ఇక్ యావత్ భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిషు పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. కానీ, అటు పాకిస్థాన్‌లో కానీ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో కలపడానికి నిజాం పాలకులు సిద్ధంగా లేకపోవడంతో అసలు సమస్య మొదలైంది. నిజాం కూడా.‘బ్రిటిష్ కామన్ ఆఫ్ నేషన్స్’ నుండి ‘రాజ్యాంగ బద్ధమైన ఒక స్వతంత్ర దేశం’గా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు నివ్వాలంటూ ప్రభువు బ్రిటిషు ప్రభుత్వాన్ని మొదట్లోనే సంప్రదించారు. ఆ విజ్ఞప్తిని వారు తిరస్కరించారు. కనీసం ఒక అధికార పత్రం (దస్తావేజు)పై సంతకం చేయాలని అప్పటి ఇండియన్ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైద్రాబాద్ ప్రభుత్వాన్ని కోరారు. ‘అదేమీ కుదరదంటూ’ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే (15.8.1947) ‘హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం’గా ఉంటుందని ప్రకటించారు, ‘కనీసం హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌లో చేర్చబోమని’ హామీ ఇవ్వాలని, అలా చేస్తే యధాస్థితిని కొనసాగించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని భారతీయ ప్రభుత్వం నిజాం రాజును కోరినా, ‘దానికీ ససేమిరా’ అన్నారు. ‘తన రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ కావాలని, అది కూడా ‘బ్రిటిష్ కామన్ సామంత దేశపు హోదాను మాత్రమే ఇవ్వాలని’ ఆయన డిమాండ్ చేశారు. ఏకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అధ్యక్షుడు హేరీ ఎస్ ట్రూమన్‌తోనూ మధ్యవర్తిత్వం నెరిపించడానికి విఫలయత్నం చేశారు. ఏదైతేనేం, నిజాం జరగకూడదని అనుకున్నారో చివరకు అదే జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నీ ఒకవైపు, రజాకార్ల దుర్మార్గాలు మరోవైపు హైదరాబాద్ ప్రజలను తీవ్ర అశాంతిలోకి నెట్టివేశాయి. ‘ఆపరేషనే’ ప్రత్యామ్నాయం ‘ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే నేను భారత్ అంతటా అల్లకల్లోలం సృష్టించి తీరతాను’ అన్నది ఖాసిం రజ్వీ శపథం. ‘భారత్ కనుక హైదరాబాద్‌పై దాడి చేస్తే రజాకార్లు హిందువులపై నరమేధం సృష్టిస్తారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లపై ప్రతీకార దాడులు జరుగుతాయి’ అని ‘టైమ్’ మేగజైన్ అప్పట్లో రిపోర్ట్ చేసింది. అలా ముగిసిపోయారు[మూలపాఠ్యాన్ని సవరించు] అది 13 సెప్టెంబర్ 1948. ఆపరేషనే మొదలైంది తొలి యుద్ధం ‘షోలాపూర్-సికింవూదాబాద్ రహదారిపైగల నాల్‌దుర్గ్ వద్ద మొదలైంది.1948 ఆగష్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్లండన్లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్ఆలీ అన్నాడు. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది. మేజర్ జనరల్ డిఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎఎ రుద్రా మద్రాసు వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. మొదటి హైదరాబాద్ నిజాం సైన్యం భారతీయ 7వ బ్రిగేడ్‌ను ఎదుర్కొంది. రెండవ రోజు (14 సెప్టెంబర్) రాజసూర్ పట్టణానికి 48 కి.మీ. దూరంలోని ఉమార్గ్‌వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. మూడోరోజు (15వ తేదీ) నాటికి భారతసైన్యం సూర్యాపేట పట్టణం చేరింది. ఇదే రోజు మరో సంఘటనలో నార్కట్‌పల్లి వద్ద భారత సైనికులు రజాకార్ల సమూహాన్ని ఓడించారు.16వ తేదీకల్లా నిజాం ఓటమి సుస్పష్టమై పోయింది. లెఫ్టెనెంట్ కల్నల్ రామ్‌సింగ్ నేతృత్వంలో భారత సైన్యం జహీరాబాద్ వైపు వచ్చింది. అయితే, ఇక్కడ రజాకార్లు ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు. భారత సైన్యం 75 ఎంఎం గన్స్ వాడేదాకా వారు అలా రెచ్చిపోతూనే ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రం యొక్క "స్వాతంత్ర్యం" కోసం "150,000 రజాకార్లు " సైనికులు "భారతీయ యూనియన్కు వ్యతిరేకంగా పోరాడటానికి" ఉద్దేశపూర్వకంగా "సమీకరించారు.పోరాట చివరి దశ నాటికి రజాకార్లలో ఐదు రకాల రజాకార్లు పని చేసిండ్రు. ముస్లిం రజాకార్లు, హిందూ రజాకార్లు, పోలీసు రజాకార్లు, కమ్యూనిస్టు రజాకార్లు, కాంగ్రెస్ రజాకార్లు.అదికారిక లెక్కల ప్రకారం 1373 మంది రజాకార్లు హతమయ్యారు. హైదరాబాద్ రాజ్యం... నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాజ్యం ఇలా ఉండేది. భారత యూనియన్ సైనిక చర్యలోమరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు.అనదికారిక లెక్కల ప్రకారం పారిపోయిన వారి సంఖ్య చాలా యెక్కువ...అందులో కొందరు చాలామంది పాకిస్తాన్ కి పారిపోయారు.. ఇక్కడే మిగిలిపోయినవాళ్లు మాత్రం గెడ్డాలు తీసేసి.. మామూలు పౌరుల్లో జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.. పలురకాల ఊచకోతల్లోను రజాకార్లు చాలా యెక్కువ మంది మరణించారు. మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు] పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM< పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=CfVyJrGeg_M పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=Thdrcb_Xwts పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=puBW7s8aFqA పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM పైకి దూకు ↑ http://www.sakshi.com/news/telangana/telangana-movement-gives-inspired-to-many-peoples-167555 పైకి దూకు ↑ https://www.ntnews.com/hyderabad-news/suvarnam-pratapreddy-death-anniversary-1-1-502568.html పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=CnMHAzU6_Uc పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు] పుచ్చలపల్లి సుందరయ్య రచన P. Sundarayya, Telengana People's Struggle and Its Lessons, December 1972, Published by the Communist Party of India (Marxist), Calcutta-29. హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు [చూపు] v t e తెలంగాణ విమోచనోద్యమం వర్గాలు: తెలంగాణ విమోచనోద్యమంతెలంగాణ చరిత్ర ... హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వివాదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇది వివాదంగానే ఉంది. నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమైన రోజు అది. నిజాం అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో భాగమైంది. ఓ వైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగానే ఉంది. ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో ద్వారా దాన్ని తనలో అంతర్భాగం చేసుకుంది. Related Videos 00:54 నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడపాలి 01:40 వన్డేల్లో 50కి పైగా యావరేజి కలిగి ఉన్న ఏకైక క్రికెటర్ ధోని 01:36 రోడ్డెక్కిన టెక్కీలు ఐటి రంగం ఎటు వెళ్తుంది ? నిజాం లొంగిపోయిన తర్వాత 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. అయితే, సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. కానీ, మజ్లీస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బ తింటాయనే భావనతో ప్రభుత్వాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలోనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గానీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా పరిగణించి సంబరాలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు అతివాద కమ్యూనిస్టులు అసలు విమోచన, విముక్తి అనే పదాలనే వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ సైన్యం 1946 - 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది. రజాకార్ల ఆగడాలు భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు. రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం సాగుతోంది. ఆ స్థితిలో హైదరాబాద్ సైన్యం ఇలా.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్ధానంలో జాసన్‌ గిలెస్పీ? శిల్పాను లేకుండా చేయాలి: అఖిలప్రియ, రంగంలోకి జలీల్ ఖాన్! దంబుల్లాలో తొలి వన్డే: ధోనికి పరీక్ష, ప్రమాదంలో శ్రీలంక Featured Posts యథాతథ స్థితికి ఒప్పందం వాస్తవ పరిస్థితిని నిజాం రాజుకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. సైన్య సమీకరణ.. 1948 ఆగష్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్‌ లండన్‌ లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ అన్నాడు. పోలీసు చర్య ప్రారంభం నిజాం చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. ఆపరేషన్ పోలో.. ఇండియన్ యూనియన్ సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో.. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో భారత సైన్యం నాలుగు వైపుల నుంచీ హైదరాబాద్ భూభాగంలోకి ప్రవేశించింది. నల్‌దుర్గ్ కోట స్వాధీనం హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది. ఇలా చుట్టుముట్టారు.. మేజర్ జనరల్ డిఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎఎ రుద్రా మద్రాసు వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. సైన్యాన్ని విరమించుకున్నాడు.. 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ చేతుల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం రాజీనామా ఇచ్చిందని, ఆ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నానని, యుద్ధం నుంచి సైన్యాన్ని విరమించుకుంటున్నానని, ఐక్యరాజ్య సమితిలలో పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. నిజాం చివరి ప్రధాని... హైదరాబాద్ చివరి నిజాం ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ ఈయనే. నిజాం ప్రభుత్వానికి మద్దతుగా దౌత్యపరమైన అనేక చర్యలను ఈయన చేపట్టారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్.. సైనిక చర్య ఆపరేషన్ పోలో జరిగిన సమయంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న నవాబ్ దీన్ యార్ జంగ్ బహదూర్... నెహ్రూతో పటేల్... ఆపరేషన్ పోలో అనేది సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ చొరవతోనే జరిగిందని అంటారు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అంతగా ఇష్టం లేదని చెబుతారు. నెహ్రూతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇలా.. ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు.. హైదరాబాద్ రాజ్యంలో కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. వారు చేయని దుష్టకృత్యం లేదు. ఆ ప్రైవేట్ ఆర్మీ ఇలా.. కాసిం రజ్వీ ఇలా.. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. . చివరి రోజుల్లో పాకిస్తాన్‌లో.. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు. పటేల్ ముందు లొంగిన నిజాం 1948 సెప్టెంబర్ 18న నిజాం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. హైదరాబాద్ రాజ్యం... నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాజ్యం ఇలా ఉండేది. భారత యూనియన్ సైనిక చర్యలోమరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. సైనిక గవర్నర్‌గా చౌదరి సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.
కాసిం రజ్వీ
Nomula Prabhakar Goud

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...